వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల మందుపాతర: సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Naxalites
మల్కాన్ గిరి: మావోయిస్టులు పేల్చిన మందుపాతర ఘటనలో శుక్రవారం ముగ్గురు సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. వీరిలో ఒక అధికారి కూడా ఉన్నాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఎంవి - 66 ప్రాంతంలో మల్కాన్ గిరికి 40 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారు.

రేషన్ కోసం సిఆర్పీఎఫ్ సిబ్బంది వ్యాన్ లో కలిమెల నుంచి గొంపగుండకు వెళ్తుండగా మావోయిస్టులు వ్యాన్ ను లక్ష్యంగా చేసుకుని కల్వర్టు కింద పెట్టిన మందు పాతర పేల్చారని మల్కాన్ గిరి పోలీసు సూపరింటిండెంట్ సత్యబ్రత భోయ్ చెప్పారు.మృతుల్లో సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండంట్ భూపేందర్ సింగ్ ఉన్నారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలు తరలి వెళ్లాయి. ఈ నెలలో మల్కాన్ గిరిలో మావోయిస్టులు దాడులకు పాల్పడిన ఘటనల్లో ఇది మూడోది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X