కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల పోటీకి వైయస్ విజయలక్ష్మి విముఖత

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayalaxmi
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి విముఖంగా ఉన్నట్లు సమాచారం. వైయస్ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి వైయస్ కుమారుడు వైయస్ జగన్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే వైయస్ జగన్ ను పోటీకి దించేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అయిష్టత వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిళతో కలిసి సోనియాను కలిశారు. జగన్ పోటీకి సోనియా ఆసక్తిగా లేరని ఆ సమయంలోనే తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరిని పోటీకి దించాలనే విషయంపై జగన్ కుటుంబ సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు.

విజయలక్ష్మి ఇష్టపడకపోతే వైయస్ కూతురు షర్మిళకు టికెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే షర్మిళ కూడా పోటీకి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఎవరి పేరును ప్రతిపాదించాలనే విషయంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. వైయస్ జగన్ భార్య భారతిరెడ్డి పేరు కూడా ముందుకు వచ్చింది. తాజాగా వైయస్ భాస్కర రెడ్డి పేరును ప్రతిపాదించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ భాస్కర రెడ్డి వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుని కుమారుడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X