దిగి వచ్చినా జగన్ కు 'నో' చాన్స్

YS Jagan
హైదరాబాద్: దిగి వచ్చినా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తగిన పాత్ర పోషించడానికి అవకాశాలు లభించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వైయస్ జగన్ సిద్ధపడ్డారు. ఈ విషయమై జగన్, ఆయన ఆత్మీయుడు కెవిపి రామచందర్ రావు మంగళవారం ఎఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి, ప్రవీణ్ దవర్ లతో మాట్లాడారు. అయితే ఈ విషయంపై నిర్ణయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)దేనని వారు తేల్చి చెప్పారు. అయితే పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గానీ ముఖ్యమంత్రి కె.రోశయ్య గానీ జగన్ ను ప్రచారం కోసం బొట్టు పెట్టి పిలవాలని జగన్ వర్గీయులు కోరుకుంటున్నారు. కానీ వారిద్దరు అందుకు సిద్ధంగా లేరు. జగన్ ను ప్రచారంలోకి దించడానికి మంగళవారం కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు వ్యూహరచన చేశారు. కానీ అది ఫలించలేదు.

తనంత తాను జగన్ ప్రచారం చేస్తే తమకు అభ్యంతరం లేదనే పద్ధతిలో డి. శ్రీనివాస్, రోశయ్య వ్యవహరిస్తున్నారు. అసలు ఆ విషయం గురించి మాట్లడడానికి వారు ఇష్ట పడడం లేదు కూడా. జగన్ ను ప్రచారానికి పిలుస్తారని ఆశించిన ఆయన వర్గం అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఆయన ప్రచారం మొదలు పెట్టడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. తొలుత మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడి ఆ తర్వాత ప్రచారంలోకి దిగాలనేది జగన్ వ్యూహం. అయితే ఎఐసిసి పరిశీలకుల నుంచి ఆహ్వానం రాకపోవడంతో జగన్ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలకు, ప్రభుత్వ కార్యకలపాలకు సంబంధించి ఏ విధమైన క్రెడిట్ కూడా జగన్ కు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. జగన్ ది కూడా మిగతా పార్లమెంటు సభ్యుల స్థాయేనని, అంతకు మించి ఆయనకు ఏ విధమైన ప్రత్యకత లేదని అటు పార్టీ అధిష్టానం ఇటు రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్పడానికి సిద్ధపడింది. దీంతో ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి గండి కొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+