మాస్టారి 'హత్య' పై విద్యార్ధుల ఆగ్రహం

ఆర్థిక లావాదేవీల వివాదంలో అత్తింటివారే హత్య చేశారని మృతుని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాజవర్ధన్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య విజయదుర్గాలకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డి.రావులపాలెం నుంచి మృతుని బంధువులు, వందలాది మంది రవితేజ, పేరూరు ఎస్బీఎం కళాశాలల విద్యార్థులు ప్రతాప్ నగర్ చేరుకుని వృతదేహాన్ని పరిశీలించి ఆందోళన చేపట్టారు. రాజవర్ధన్ అత్త రాజ్యం, భార్య విజయదుర్గాలకి, మరిది పరమేశులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం-చిందాడగరువు రోడ్డుపె బైఠాయించి రాస్తారోకో చేశారు.
మృతుని కుటుంబీకులు హత్యేనని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ఎన్.వెంకటేశ్వరరావు హామీ ఇచ్చినప్పటికీ అంగీకరించలేదు. వృతదేహాన్ని కదలనివ్వమని భీష్మించారు. దీంతో పట్టణ ఎస్ఐ బిహెచ్.వెంకటేశ్వర్లు వృతుని అత్త రాజ్యం, భార్య విజయ దుర్గాలకిలను అదుపులోకి తీసుకోవడంతో ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications