వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిబర్హాన్ నివేదికపై రాజ్యసభలో ఘర్షణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: లిబర్హాన్ కమిషన్ నివేదికపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం లిబర్హాన్ కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను పార్లమెంటు సమర్పించారు. చర్యల నివేదికతో పాటు 900 పేజీల లిబర్హాన్ కమిషన్ నివేదికను చిదంబరం పార్లమెంటుకు సమర్పించారు. నివేదికను ప్రవేశపెట్టగానే బిజెపి సభ్యులు రాజ్యసభలో నినాదాలు చేయడం ప్రారంభించారు. చైర్మన్ వెల్ లోకి దూసుకెళ్లారు. నివేదికపై ప్రభుత్వం ఎల్లుండి చర్చ జరుగుతుందని చెప్పగా వెంటనే చర్చను చేపట్టాలని బిజెపి సభ్యులు పట్టుబట్టారు.

బిజెపి సభ్యులకు, సమాజ్ వాదీ సభ్యులకు మధ్య ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అమర్ సింగ్ ను బిజెపి సభ్యులు తోసేశారు కూడా. తోపులాట జరిగింది. ఎస్ఎస్ అహ్లువాలియా అమర్ సింగ్ కాలర్ పట్టుకుని కొట్టారు. పార్టీ సహచరులు వారిద్దరినీ విడదీశారు. ఆ తర్వాత అమర్ సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ సభ్యులు వెనక్కి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్ పర్సన్ కె రెహ్మాన్ ఖాన్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X