వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూల్ భవంతిని పేల్చేసిన మావోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jharkhand
రాంచీ: జార్ఖండ్ గిరిధ్ జిల్లాలోని మంజిల్దిహ్ గ్రామంలో మావోయిస్టులు పాఠశాల భవనాన్ని పేల్చేశారు. గిరిధ్ జిల్లాలోని సోమవారం రాత్రి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పేల్చేసినట్లు, భవనం దెబ్బ తిన్నట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ రవికాంత్ ధన్ చెప్పారు. పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లారు.

భద్రతా బలగాలు పాఠశాలను ఆశ్రయంగా మార్చుకోవడంతో మావోయిస్టులు దానిపై దాడి చేశారు. పోలింగ్ ను బహిష్కరించాలని మావోయిస్టులు జిల్లాలో పోస్టర్లు అతికించారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఐదు దశల్లో సాగుతోంది. తొలి విడత పోలింగ్ బుధవారం సాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X