కెసిఆర్ ఆమరణ దీక్షను ఆపలేరు: నాయని

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం వల్ల తెలంగాణ రాదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇప్పటికే రావాల్సి ఉండిందని, అయితే అవగాహనా లోపం వల్ల జాప్యమైందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్ర్తత్యేక తెలంగాణపై మినహా ఫ్రీజోన్, ఆరు సూత్రాల పథకం, అసైన్డ్ భూముల ఆక్రమణ వంటి సమస్యలపై తాను మధ్యవర్త్తిత్వం చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, డిజిపి గిరీష్ కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిశారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని రోశయ్య గిరీష్ కుమార్ కు సూచించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications