జగన్ సాక్షిపై రామోజీ ఈనాడు బాంబు

ఈ ఏడాది మే 16వ తేదీ శాసనసభ ఫలితాలు వెలువడగా జగన్ స్థాపించిన సాక్షికి మే 21వ తేదీన వివిధ సంస్థల నుంచి 243 కోట్ల 60 లక్షల రూపాయలు వాటాల కొనుగోళ్ల రూపంలో సమకూరినట్లు తెలిపింది. అంతకు ముందు కొద్ది నెలల క్రితం నవంబరు 5వ తేదీన సాక్షికి ఇలా సమకూరిన నిధులు 39 కోట్ల 99 లక్షల రూపాయలు కాగా, రూ. 10 విలువైన ూరపరబ షేరును రజ. 350 ప్రీమీయంతో వివిధ సంస్థలు కొనుగోలు చేయడంతో మొత్తం 283కోట్ల 69 లక్షల రూపాయల వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు సమకూరినట్లు ఈనాడు దినపత్రిక వార్తాకథనం వివరించింది. సాక్షికి ఈ విధంగా నిధులు సమకూర్చినందుకు వివిధ సంస్థలు అత్యంత ఉదారంగా కేటాయింపులు పొందినట్లు ఆరోపించింది. చట్టబద్దంగా నిధులు మళ్లించేందుకు కొన్ని బినామీ కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు రాసింది. ఏయే కంపెనీ ఎంతెంత సమకూర్చిందీ అనే వివరాలను కూడా ఈనాడు దినపత్రిక తన వార్తాకథనంలో ఇచ్చింది.












Click it and Unblock the Notifications