డిసెంబర్ తొలి వారంలో ఢిల్లీకి రోశయ్య
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమర నిరాహార దీక్ష, పులివెందుల శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి ఖరారు వంటి అంశాలపై కూడా ఆయన పార్టీ అధిష్టానంతో చర్చిస్తారు. పులివెందుల అభ్యర్థి ఖరారైతే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడమా, లేదా అనేది తేలుతుంది. సిఎల్పీ సమావేశం డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించి, ఆ వెంటనే శాసనసభా సమావేశాలు ఏర్పాటుచేయాలనే యోచనలో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి సజావుగా జరగడానికి పార్టీ అధిష్టానంతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది.
Comments
hyderabad హైదరాబాద్ chief minister kcr ముఖ్యమంత్రి rosaiah రోశయ్య కె చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన కాంగ్రెసు అధిష్టానం
Story first published: Wednesday, November 25, 2009, 12:23 [IST]