కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇంటి వద్ద పెద్ద యెత్తను పోలీసులు మోహరించారు. కనీవినీ ఎరుగరని రీతిలో పోలీసుల మోహరింపు ఉంది. కెసిఆర్ గురువారం రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకుంటున్నారు. రెండు రోజుల పాటు కరీంనగర్ లో విశ్రాంతి తీసుకుని ఈ నెల 29వ తేదీన సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడానికి బయలుదేరుతానని ఆయన చెప్పారు. కెసిఆర్ ను గురువారం రాత్రి సిక్కు మత గురువులు వచ్చి కలిశారు. కెసిఆర్ ఇంటి వద్ద శుక్రవారం అయ్యప్ప స్వామి పూజకు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది అయ్యప్ప భక్తులు ఈ పూజలో పాల్గొంటున్నారు.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష శాంతియుతంగా సాగుతుందని, ఏ విధమైన హింసకు తావు ఉండదని కెసిఆర్ కుమారుడు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావుతో పాటు తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష సాగించడానికి కూడా ప్రభుత్వం వీలు లేని వాతావరణాన్ని కల్పిస్తోందని రామారావు విమర్శించారు. బైండోవర్ నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య ముందుకు రావాలని, ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు చర్చించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్దిష్ట చర్యలకు పూనుకునేలా చేయాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X