కెకె దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జగన్ అభిమానులు

రాష్ట్రంలో ఎనిమిది కోట్ల ప్రజలకు తెలిసిన వైఎస్ జగన్ పేరు కేకేలాంటి వృద్ధనాయకుడికి తెలియకపోవడం పార్టీ చేసుకున్న దురదృష్టమని వ్యాఖ్యానించారు. కేకే స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా ఆయన తిరగనీయకుండా చేస్తామన్నారు. ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి వాసం కోటేశ్వరరావు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చిట్టెం వేణుగోపాల్, గోలి విశ్వేశ్వరరావు, కుక్కల సుధాకర్, పీ శ్రీనివాసరెడ్డి, మల్లు మోహనరావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications