వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా విందు భళే పసందు: మన్మోహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు శ్వేతసౌధంలో ఇచ్చిన విందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిదా అయ్యారు. శ్వేతసౌధం విందు అద్భుతమని ఆయన అన్నారు. తాను ఇప్పటి వరకు చూసిన విందుల్లో ఇది అత్యుత్తమమైందని ఆయన అన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఆ విధంగా అన్నారు. ఇది తనకు విశిష్టమైన అనుభవమని, అన్ని రకాలుగా బాగా ఉందని ఆయన అన్నారు.

మంగళవారంనాడు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులకు ఒబామా విందు ఇచ్చారు. అక్కడికి వచ్చిన అతిథులు కూడా అంతే అద్భుతమని ఆయన అన్నారు. తాను ఎంతో ఆనందించానని ఆయన చెప్పారు. అక్కడికి అద్భుతమైన అతిథులు వచ్చారని, వారిని కలుసుకోవడం మంచి అనుభవమని ఆయన అన్నారు. భారత సంతతికి చెందిన అతిథులు తమ విశిష్టతను చాటారని ఆయన అన్నారు. వారు తమకు గౌరవాన్ని తెచ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇది ఒబామా వ్యక్తిత్వానికి అద్దం పట్టిందని ఆయన చెప్పారు. తాను భారతీయుడినైనందుకు గర్వించేలా విందు ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X