అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నాటక ఎక్స్ ప్రెస్ బోగీల్లో మంటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Fire Accident
అనంతపురం: దేశ రాజధాని ఢిల్లీ నుంచి కర్నాటక రాజధాని బెంగుళూర్ కు బయలుదేరిన కర్నాటక ఎక్స్ ప్రెస్ రైలుకు శనివారం ముప్పు తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద ఆ రైలు ప్రమాదానికి గురైంది. కొన్ని బోగీల్లో మంటలు లేచాయి. దీంతో రైలును గుంతకల్లు వద్ద నిలిపేసి రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ధ్వంసమైన బోగీల స్థానంలో కొత్త బోగీలను చేర్చి ప్రయాణికుల తరలింపునకు చర్యలు తీసుకున్నారు. మరమ్మతుల తర్వాత తనిఖీలు చేసి రైలు వెళ్లడానికి అధికారులు పచ్చ జెండా ఊపారు.

కింది స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లనే బోగీల్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు లేచినట్లు అధికారులు అంటున్నారు. రెండు బోగీలు మంటలకు దెబ్బ తిన్నాయి. దీని వల్ల 10 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు అనధికారిక అంచనా. ఈ ప్రమాదం వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X