జగన్ వైపు మొయిలీ: అందుకే ప్రణబ్?

Veerappa Moily
హైదరాబాద్: కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశానికి ప్రత్యేకంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పంపడం వెనక కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో పాటు ప్రణబ్ ముఖర్జీ కూడా శుక్రవారం హైదరాబాద్ వచ్చి సిఎల్పీ సమావేశం నిర్వహించారు. అంతా ప్రణబ్ ముఖర్జీయే ముందుండి నడిపించారు. వీరప్ప మొయిలీని పక్కన పెట్టుకుని ప్రణబ్ వ్యవహారాలు నడిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మొయిలీ వైయస్ జగన్ శిబిరానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమాలు ఉండడం వల్లనే సోనియా ప్రణబ్ ను పంపినట్లు చెబుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి చివరి నిమిషంలో వైయస్ జగన్ దిగడం వెనక కూడా మొయిలీ పాత్ర ఉందని అంటున్నారు. మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి అనుకూలంగా ఉంటూ వస్తున్న మొయిలీ ఇప్పుడు జగన్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే సోనియా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దానికి మొయిలీ జగన్ సానుకూల వైఖరి పనికి రాదనే అభిప్రాయానికి సోనియా వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ప్రణబ్ కు పూర్తి అధికారాలు ఇచ్చి వీరప్ప మొయిలీని వెంట పంపినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+