వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాకరేకు ఇంటి పోరు: కాంగ్రెసులోకి కోడలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Smita
ముంబై: శివసేన అధినేత బాల్ థాకరేకు ఇంటిలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. థాకరే కోడలు స్మితా థాకరే కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారు. ఆ విషయాన్ని ఆమె అకస్తాత్తుగా ప్రకటించి బాంబు పేల్చారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్నందున తాను కాంగ్రెసు నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిమానిగా మారినట్లు ఆమె చెప్పారు. శివసేన రాజకీయాలు మహారాష్ట్రీయన్ల పట్ల సరిగా లేవని భావించడం, థాకరే కుటుంబంలో తనను పథకం ప్రకారం పక్కకు నెట్టారనే అభిప్రాయం కలగడం స్మిత నిర్ణయానికి కారణాలని భావిస్తున్నారు.

తాను ఎంత మాత్రమూ ఇబ్బంది పడదలుచుకోలేదని, కాంగ్రెసులో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని స్మిత చెప్పారు. కాంగ్రెసుకు జాతీయ, ప్రాపంచిక దృక్పథం ఉందని ఆమె ప్రశంసిస్తున్నారు. కాంగ్రెసు సిద్ధాంతంతో తాను సౌకర్యంగా ఉందని ఆమె అన్నారు. సోనీయా పార్టీని, దేశాన్ని నడిపిస్తున్న తీరును తాను వ్యక్తిగతంగా అభిమానిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాహుల్ ఎంతో పని చేస్తున్నారని ఆమె ప్రశంసించారు. తాను ఢిల్లీ నాయకులను సంప్రదిస్తున్నానని, కాంగ్రెసులో చేరడమే తరువాయి అని ఆమె అన్నారు. త్వరలో ఆమె సోనియాను, రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.శివసేన - బిజెపి కూటమి 1995లో అధికారంలోకి వచ్చినప్పుడు స్మిత అధికార కేంద్రంగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X