రోశయ్యను ఇరుకున పెట్టేందుకే..: పాల్వాయి
ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల చర్యలు సమర్థనీయం కాదని, విద్యార్థులను అంతగా కొట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించి అత్యుత్సహాం ప్రదర్శించారని ఆయన అన్నారు. కాంగ్రెసు క్షేమం కోరే వారైతే పిచ్చి ప్రేలాపనలు తగవని ఆయన సూచించారు. కొంత మంది వ్యక్తులు రోశయ్య ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అరెస్టు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకులు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ ఖమ్మం fast కాంగ్రెసు కె చంద్రశేఖర రావు palwai govardhan reddy ఆమరణ నిరాహార దీక్ష పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
Story first published: Monday, November 30, 2009, 13:29 [IST]