హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యను ఇరుకున పెట్టేందుకే..: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యను ఇరకాటంలో పెట్టేందుకే తమ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు తెలంగాణపై రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణపై కొంత మంది కాంగ్రెసు నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కాంగ్రెసు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఉస్మానియా విద్యార్థులపై పోలీసుల చర్యలు సమర్థనీయం కాదని, విద్యార్థులను అంతగా కొట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించి అత్యుత్సహాం ప్రదర్శించారని ఆయన అన్నారు. కాంగ్రెసు క్షేమం కోరే వారైతే పిచ్చి ప్రేలాపనలు తగవని ఆయన సూచించారు. కొంత మంది వ్యక్తులు రోశయ్య ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అరెస్టు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకులు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X