కదం తొక్కుతున్న తెలంగాణ విద్యార్థులు

వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ఆందోళనకు నడుం బిగించారు. ముగ్గురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు. మిగతా విద్యార్థులు రిలే నిరాహార దీక్షలకు పూనుకుంటున్నారు. కెసిఆర్ దీక్షను భగ్నం చేసిన నేపథ్యంలో స్వతంత్రంగా విద్యార్థి ఉద్యమాన్ని సాగించేందుకు సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) ఏర్పిడింది. విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న ఈ జెఎసి తెలంగాణ సాధన కోసం విద్యార్థి ఉద్యమాలకు కార్యాచరణను రూపొందించి, సమన్వయం చేస్తుంది. సోమవారం కెసిఆర్ పై భగ్గుమన్న విద్యార్థులు మంగళవారం చల్లబడ్డారు. కెసిఆర్ కు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications