కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నామినేషన్ వేసిన వైయస్ విజయలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayalakshmi
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజక వర్గానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలువురు మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెసు నాయకులు కదిలి వచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందుల శాసనసభా సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా విజయలక్ష్మిని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖరారు చేశారు.

నిజానికి, ఆమె పోటీకి సుముఖంగా లేరు. సోనియా గాంధీ నచ్చజెప్పడంతో ఆమె పోటీకి సిద్ధపడ్డారు. ఆమె మంగళవారం నాడు భర్తను తలుచుకుని కంట తడి పెడుతూనే ఉన్నారు. ఈ స్థితిలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడే స్థితి కూడా లేదు. ఇప్పటి వరకు పులివెందులకు ఆమె నామినేషన్ ఒక్కటే దాఖలైంది. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకూడదనే నిర్ణయం తీసుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రేపు (బుధవారం) నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. ఈ నెల 5వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుంది. విజయలక్ష్మి ఎన్నికను అధికారులు ఎప్పుడు కచ్చితంగా ప్రకటిస్తారనే తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X