ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మంలో కెసిఆర్ కు భద్రత లేదు: జయశంకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayashankar
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు ఖమ్మంలో భద్రత లేదని, కెసిఆర్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కెసిఆర్ ను వరంగల్ గానీ హైదరాబాద్ గానీ తరలించాలని అడుగుతున్నాం తప్ప వసతుల కోసం కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఆర్ మాట్లాడే స్థితిలో లేరని ఆయన చెప్పారు. వైద్య పరీక్షల పేరుతో లోపలికి పదే పదే వస్తూ తమను బయటకు పంపించి కెసిఆర్ కు సెలైన్ ఎక్కించారని ఆయన చెప్పారు. ఇప్పుడు సెలైన్ తీసేసినట్లు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. పరీక్షల కోసం వస్తున్నామని చెప్పడంతో తాము అనుమానించలేదని ఆయన చెప్పారు. కెసిఆర్ ఆహారం తీసుకోవడం లేదని, నిరసన తెలుపుతూనే ఉన్నారని ఆయన చెప్పారు.

మంగళవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య, డిజిపి గిరీష్ కుమార్, ఇంటిలిజెన్స్ ఐజి మహేందర్ రెడ్డి కెసిఆర్ తో మాట్లాడారని, వారు ఆరోగ్యం గురించి వాకబు చేశారు తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని ఆయన చెప్పారు. తమ ముఖ్య లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెసిఆర్ జీవితంతో తెలంగాణ ఉద్యమం ముడిపడి ఉందని, అందువల్ల కెసిఆర్ ఆరోగ్యం కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంలో ఒక మెట్టు మాత్రమేనని, దాంతో ఉద్యమం ఆగదని, మరింత ఉధృతమవుతోందని అన్నారు. వైద్యులు ఏం చేస్తారో చెప్పడం కష్టమని, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే ఉందని ఆయన చెప్పారు. దేన్నైనా తాము ఎదుర్కుంటామని చెప్పారు.

పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని, ఇద్దరు శాసనసభ్యులను ఈడ్చుకెళ్లారని, తలుపులు పగులగొట్టి కెసిఆర్ గదిలోకి ప్రవేశించారని, పోలీసులు కెటి రామారావును, నాయని నర్సింహారెడ్డిని కొట్టారని ఆయన చెప్పారు. విద్యార్థుల పోరాటం ఉద్యమాన్ని ఉధృతికి ఊతం ఇస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రాణత్యాగానికి పాల్పవడద్దని, అవసరమైతే తాము ప్రాణ త్యాగం చేస్తామని ఆయన చెప్పారు. ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ రాదని, పోరాటం ద్వారా మాత్రమే వస్తుందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే తాము తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను తెరాస ఆదుకుంటుందని ఆయన చెప్పారు. సమిష్టి పోరాటాలను తాను సమర్థిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X