కాంగ్రెసు నేతల ఇళ్లు ముట్టడిస్తాం: ఈటెల
తమ రాష్ట్రం తమకు కావాలని ఆయన అన్నారు. తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని, తాను చూసుకుంటానని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడాన్ని ఆయన తప్పు పట్టారు. రోశయ్య మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాకపోతే పది జిల్లాలు అగ్నిజ్వాలలు కురిపిస్తాయని, కాంగ్రెసు మట్టి కరుస్తుందని ఆయన అన్నారు. అరెస్టు చేసిన తెలంగాణ నాయకులను, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అందువల్ల మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డితో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ telangana తెలంగాణ k chandrasekhar rao fast ఈటెల రాజేందర్ కె చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష etela rajender
Story first published: Thursday, December 3, 2009, 9:59 [IST]