కెసిఆర్ తో దీక్షను విరమింపజేయండి: మన్మోహన్ సింగ్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలంగా ఆందోళన సాగుతోందని, హింస జరగకుండా చూడాలని ప్రధాని కాంగ్రెసు ఎంపీలకు సూచించినట్లు చెబుతున్నారు. చిన్న రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణపై ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోలేమని ప్రధాని వారితో చెప్పినట్లు సమాచారం. అయితే తమకు రాష్ట్రంలో ఇబ్బందులున్నాయని, దానికి ఏదో రకంగా పరిష్కారం చూపాలని ఎంపీలు ప్రధానిని కోరినట్లు సమాచారం. పది నిమిషాల పాటు వారు ప్రధానితో మాట్లాడారు.
కాంగ్రెసు ఎంపీల నుంచి ప్రధాని కొంత సమాచారం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రధాని వారికి చెప్పినట్లు సమాచారం. గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నాల ప్రభాకర్, మందా జగన్నాథం, మధు యాష్కీ గౌడ్ తదితరులు ప్రధానిని కలిసినట్లు సమాచారం.