వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా వర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీం చీఫ్ జస్టిస్

By Santaram
|
Google Oneindia TeluguNews

Andhra University
విశాఖపట్నం: ఆంధ్రాయూనివర్శిటీ 76వ స్నాతకోత్సవం శనివారం జరగనున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఏయూ ఉప కులపతి ఆచార్య బీల సత్యనారాయణ తెలిపారు. గురువారం సెనేట్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌డీ తివారీ కులపతి హోదాలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని, ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ హాజరుకానున్నట్టు తెలిపారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు న్యాయమూర్తులు రానున్నారని, ఇప్పటికే న్యాయమూర్తులు మీనాకుమారి, ధర్మారావులు వస్తున్నట్టు వర్తమానం పంపారన్నారు.

ఈ పర్యాయం న్యాయ విభాగం నుంచి ఎక్కువ మంది ప్రముఖులు వస్తున్నందున వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్‌కు డాక్టర్‌ ఆఫ్‌ లా ప్రదానం చేయనున్నామని, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కళాప్రపూర్ణ, జీఎంఆర్‌ అధినేత మల్లిఖార్జునరావు, పాండిచ్చేరి లెఫ్టనెంట్‌ గవర్నర్‌ ఇక్బాల్‌సింగ్‌కు గౌరవడాక్టరేట్స్‌ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 238 మందికి పీహెచ్‌డీ, 62 మందికి ఎంఫిల్‌ డిగ్రీలు, పది మందికి బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నట్టు వివరించారు. పీహెచ్‌డీ పట్టా తీసుకోనున్న 170 మంది పురుషులలో ఆర్ట్స్‌ విభాగం నుంచి 36 మంది, సైన్స్‌లో 50, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో 22, ఇంజనీరింగ్‌లో 30, కెమిల్‌ ఇంజనీరింగ్‌లో ఐదుగురు, ఎడ్యుకేషన్‌ లో ఏడు, 'లా'లో ఐదుగురు, ఫార్మసీలో 14 మంది ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X