అసెంబ్లీ గదిలో తెరాస ఎమ్మెల్యేల నిరాహార దీక్ష

తమ పార్టీ నేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా తాము ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు శాసనసభ్యుడు నల్లాల ఓదేలు చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలని కూడా ఓదేలు, ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని, ఈ స్థితిలో ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం చేయాలనేది తమ కోరిక అని వారన్నారు. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పుడు కాంగ్రెసు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వారన్నారు. శాసనసభ ప్రధాన గేట్లు కూడా మూసేశారు. శాసనసభ సభ్యులు కానివారు ఇక్కడ మాట్లాడకూడదని అసెంబ్లీ సిబ్బంది చెబుతున్నారు. ఈ స్థితిలో శాసనసభ వద్ద జై తెలంగాణ నినాదాలు జోరందుకున్నాయి.












Click it and Unblock the Notifications