హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఆరోగ్యంపై గవర్నర్ తివారీ ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆరోగ్యంపై రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ ఆరా తీశారు. ఆయన సోమవారం ఉదయం కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. కెసిఆర్ ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రాన్ని సంప్రదించాలని కెటి రామారావు ఈ సందర్భంగా గవర్నర్ ను కోరారు.

కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యులు నిజం చెప్పడం లేదని కెటి రామారావు విమర్శిస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులమైన తమకు ఒక రకంగా, ప్రజలకు మరో రకంగా చెబుతున్నారని ఆయన విమర్శించారు. తను బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో వైద్యులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. దీక్ష విరమించకపోతే కెసిఆర్ కు ప్రమాదం వాటిల్లుతుందని వారు తమతో చెబుతున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X