హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి తెలంగాణ ధర్నా: నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, కార్యకర్తలు మంగళవారం శాసనసభ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి సహా బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు వారు శాసనసభ గేటు వద్ద బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణ ప్రస్తావన రాకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన అడిగారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం పెట్టిన అఖిల పక్ష సమావేశాన్ని ఆభాసు పాలు చేశారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. యుపిఎ ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ తెలంగాణపై తమ వైఖరిని ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీలు తెలంగాణ తీర్మానానికి మద్దతు తెలుపుతామని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోవడాన్ని వారు తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X