హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో సాధారణ స్థితి: సంబరాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: విద్యార్థుల శాంతి ర్యాలీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నిరాహార దీక్షతో అట్టుడికిన తెలంగాణలో బుధవారం రాత్రి నుంచే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన వెంటనే తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. అట్టుడికుతూ వచ్చిన హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయంలో వియోజత్సవ హేల కనిపించింది. విద్యార్థులు రాత్రి మొత్తం సంబరాలు జరుపుకున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయాందోళనల ఒక్కసారిగా తెలంగాణ బయట పడింది. ఎక్కడికక్కడ పోలీసులు వెనక్కి తగ్గారు.

తాము తలపెట్టిన చలో అసెంబ్లీ శాంతి ర్యాలీని విద్యార్థులు విజయోత్సవ ర్యాలీగా మార్చారు. ఉద్యమంలోకి మావోయిస్టులు ప్రవేశించాయంటూ, అసాంఘిక శక్తులు చొరబడ్డాయంటూ తీవ్ర నిర్బంధ పరిస్థితులను కల్పించారు. ఐజి అనురాధ నేతృత్వంలో అణచివేతకు రంగం సిద్ధం చేశారు. అయితే చిదంబరం ప్రకటన వెలువడగానే బలగాలు వెనక్కి తగ్గాయి. హైదరాబాదులో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తేశారు. ఒక్కసారిగా హైదరాబాద్ భయం గుప్పిట్లోంచి బయటపడింది. తీవ్ర ఉత్కంఠ, భయాందోళనల మధ్య తెలంగాణ బుధవారం రాత్రి వరకు కొట్టుమిట్టాడుతూ వచ్చింది. గురువారం తెలంగాణ అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X