వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థరాత్రి విభజన నిర్ణయమా?: ఆనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: సినిమాకు పోయి తిరిగి వచ్చేలోగా అర్థరాత్రి కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుందని కాంగ్రెసు కోస్తా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి విమర్సించారు. తెలంగాణేతర శాసనసభ్యుల తరఫున ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంగా, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా విశాలాంధ్ర ఏర్పడిందని ఆయన అన్నారు. దాన్ని ఛిన్నాభిన్నం చేయడం తగదని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా 40 రోజులు నిరాహార దీక్ష చేశారని ఆయన చెప్పారు.

పొట్టి శ్రీరాములు సెలైన్లు ఎక్కించుకోలేదని, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకోలోదని, ఫ్లూయిడ్స్ ఇచ్చే స్థితి ఆ రోజుల్లో లేదని ఆయన అన్నారు. ప్రాణాలను తృణప్రాయంగా పొట్టి శ్రీరాములు ఎంచారని ఆయన అన్నారు. పదవుల కోసం తాము రాజీనామాలు చేయడం లేదని ఆయన అన్నారు. కొంత మంది స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల అస్తిత్వానికి నేడు భంగం వాటిల్లుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X