వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిళ్లై తెలంగాణ ప్రకటనపై చిదంబరం మండిపాటు
పిళ్లై ప్రకటనపై తెలంగాణేతర ప్రాంత పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రకటన చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. తెలంగాణ అంత తేలికైపోయిందా అని ప్రశ్నించారు. హోం శాఖ కార్యదర్శి తెలంగాణ ఇస్తారా, ఇవ్వమనండి అని అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో పిళ్లై ప్రకటన చిదంబరానికి రుచించినట్లు లేదు. సోనియా నివాసంలో కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమైంది. రాజీనామా చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
Story first published: Friday, December 11, 2009, 17:02 [IST]