వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిళ్లై తెలంగాణ ప్రకటనపై చిదంబరం మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ రాషట్ర్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లై చేసిన ప్రకటనపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మండిపడ్డారు. పిళ్లై ప్రకటనను ఆయన తీవ్రంగా పరిగణించారు. పిళ్లైకు చిదంబరం ఫోన్ చేసి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మాట్లడడాన్ని తప్పు పట్టారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందని, తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పిళ్లై ప్రకటించడంతోనే రాజకీయ ప్రకంపనలు పుట్టాయి. పిళ్లై ప్రకటనపై తనకు తెలియదని, పిళ్లైనే అడగాలని చిదంబరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

పిళ్లై ప్రకటనపై తెలంగాణేతర ప్రాంత పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రకటన చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. తెలంగాణ అంత తేలికైపోయిందా అని ప్రశ్నించారు. హోం శాఖ కార్యదర్శి తెలంగాణ ఇస్తారా, ఇవ్వమనండి అని అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో పిళ్లై ప్రకటన చిదంబరానికి రుచించినట్లు లేదు. సోనియా నివాసంలో కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమైంది. రాజీనామా చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X