వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీర్మానం ఎలా పెడతారో తెలియదు: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ఎలా ప్రవేశపెడతారో తనకు తెలియదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర శాసనసభ్యులు రాజీనామాల నేపథ్యంలో ఆయన శుక్రవారం ఆ ప్రకటన చేశారు. కాగా, శానసభ్యుల రాజీనామాల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని తమ పార్టీ అధిష్టానం అంచనా వేస్తోందని కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. కాంగ్రెసు కోస్తాంధ్ర, రాయలసీమ పార్లమెంటు సభ్యులు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. తమకు అనుకూలమైన నిర్ణయం అధిష్టానం నుంచి వస్తుందని ఆశిస్తున్నామని కోస్తాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. తమ అభిప్రాయాలను ప్రధానికి వినిపించినట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీల అసలు రంగు బయట పడిందని ఆయన అన్నారు.

కాగా, హైదరాబాదులో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల రాజీనామాలు, అధిష్టానం వద్ద ఆ ప్రాంత నేతలు వినిపిస్తున్న వాదనలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీనియర్లు చెప్పారు. డి. శ్రీనివాస్ శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు.

కేంద్రం ఒక్కసారి మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను తెలంగాణ నుంచి ఎవరూ వేరు చేయలేరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశాన్ని కొందరు రాజకీయ క్రీడగా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన మాటకు వివిధ పార్టీల నాయకులు కట్టుబడి వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X