తీర్మానం ఎలా పెడతారో తెలియదు: చిదంబరం
కాగా, హైదరాబాదులో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల రాజీనామాలు, అధిష్టానం వద్ద ఆ ప్రాంత నేతలు వినిపిస్తున్న వాదనలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీనియర్లు చెప్పారు. డి. శ్రీనివాస్ శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాదు తిరిగి వచ్చారు.
కేంద్రం ఒక్కసారి మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను తెలంగాణ నుంచి ఎవరూ వేరు చేయలేరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశాన్ని కొందరు రాజకీయ క్రీడగా వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన మాటకు వివిధ పార్టీల నాయకులు కట్టుబడి వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.