రోశయ్యనే రాజీనామాలు చేయించారు: కిషన్

Kishan Reddy
హైదరాబాద్: ప్రస్తుత సంక్షోభానికి ముఖ్యమంత్రి రోశయ్య నాయకత్వం వహిస్తున్నారని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుత స్థితికి రోశయ్య బాధ్యత వహించాలని ఆయన అన్నారు. శాసనసభ సోమవారానికి వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల మనోభావాలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుకుంటున్నారని ఆయన తప్పు పట్టారు. మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో కాంగ్రెసు, తెలుగుదేశం నాయకత్వాలు ఆడుకుంటున్నాయని ఆయన అన్నారు.

శాసనసభ్యులతో రోశయ్యనే రాజీనామాలు చేయించారని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి మాట మార్చారని ఆయన అన్నారు. శాసనసభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు. ఒత్తిడితోనే వారు రాజీనామాలు చేశారని, అన్ని రాజీనామా పత్రాలు ఒకే రకంగా టైప్ చేసి ఉండడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. నైతిక విలువలు లేకుండా పోయాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+