వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ హామీపై వెనక్కి తగ్గం: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై హామీపై వెనక్కి తగ్గబోమని, అయితే అందరికీ నచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని మన్మోహన్ సింగ్ కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులతో చెప్పారు. రాయలసీమ, కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యులు శుక్రవారం ప్రధానితో సమావేశమయ్యారు. తమ హామీని అమలు చేసే విషయంలో తొందరపడబోమని ప్రధాని చెప్పారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వెలువడిన తర్వాత తలెత్తిన పరిణామాలను గమనిస్తున్నామని, దీనిపై తాము తర్జన భర్జన పడుతున్నామని ఆయన అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.

కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన అపార్థానికి దారి తీసిందని, ఆ ప్రకటన సరిగా వెళ్లలేదని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాలవారి మనోభావాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా తమ నిర్ణయం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవాల్సిందిగా ప్రధాని కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీలకు సూచించారు. కోస్తాంధ్ర, తెలంగాణ ఎంపీలు ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం మరోసారి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X