Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సానుకూలంగా పరిష్కరించుకుందాం: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుందామని, అన్ని ప్రాంతాల వారు శాంతియుతంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య విజ్ఞప్తి చేశారు. అందరినీ విశ్వాసంలోకి తీసుకున్న తర్వాతనే నిర్ణయం జరుగుతుందని ఆయన అన్నారు. సభ్యుల రాజీనామాల నేపథ్యంలో సభకు హాజరు తగ్గిపోవడంపై ఆయన శుక్రవారం ఉదయం శాసనసభలో మాట్లాడారు. ఆమోదించలేదు కాబట్టి రాజీనామాలు చేసిన సభ్యులు సభలోకి రావద్దని అనలేమని, కొంత మంది శాసనసభ్యులు సభలోకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేశారని, దీంతో గందరగోళం ఏర్పడిందని ఆయన అన్నారు. సభను ఈ స్థితిలో నడపగలమా, లేదా అనేది స్పీకర్ ఆలోచించాలని ఆయన కోరారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి అధికార పూర్వకంగా వెలువడే వరకు రణగొణ ధ్వనులు కూడవని ఆయన సూచించారు. అయితే పరిస్థితిని ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల వారు శాంతియుతంగా వ్యవహరించాలని, విధ్వంసానికి పాల్పడకూడదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు చొరబడి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, పోలీసులు సంయమనం పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. సమస్య కేవలం అధికార పార్టీకి మాత్రమే సంబధించిందని అనుకోవద్దని, అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+