Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రక్రియ అంటే సంప్రదింపులే: సిఎం

Rosaiah
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించడమంటే సంప్రదింపులు జరపడమేనని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలని కేంద్రం నుంచి లిఖితవూర్వకంగా గానీ మౌఖికంగా గానీ తనకు ఆదేశాలు రాలేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని మాత్రమే చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించారని చెప్పగానే దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి డిమాండ్లే వస్తున్నాయని వార్తలు వచ్చాయని, మంచికి మనం ఆదర్సమైతే ఫరవా లేదని, అయితే ఇటువంటివాటికి ఆదర్శం కావడం మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీలోని అగ్ర నాయకత్వానికి తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు డిమాండ్ పై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వేసిన కమిటీని పునరద్ధరించే ఆలోచన తనకు ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితులను కేంద్రంలోని అగ్ర నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి రాజకీయ నాయకులు ప్రయత్నించాలని ఆయన సూచించారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో మాట్లాడానని, సంయమనం పాటించాలని ఉమ్మడిగా పిలువునివ్వడానికి ఈ సమావేశం పెట్టానని, అయితే ఈ సమావేశానికి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాలేదని, తాము విడిగా శాంతియుత పరిస్థితి స్థాపనకు ప్రయత్నిస్తామని చెప్పారని ఆయన చెప్పారు. విద్యార్థులు ఉద్రేకాలకు లోను కావద్దని, చదువులు పాడు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా, శాంతియుత పరిస్థితులు దెబ్బ తినకుండా చూడాలని ఆయన సూచించారు. రాష్ట్రం ఆందోళనలకు నిలయమనే భావనను పారదోలుదామని ఆయన చెప్పారు.

శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే ప్రభుత్వం మైనారిటీలో పడుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజీనామాలు చేసినవారిలో అన్ని పార్టీ సభ్యులున్నారని ఆయన చెప్పారు. ఏ పార్టీకి అల్లర్లు ప్రేరేపించాలని ఉండదని ఆయన అన్నారు. సరైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని మాత్రమే కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని ఆయన చెప్పారు. సరైన సమయంలో అనే పదం చిదంబరం వాడలేదని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా తాను టెలివిజన్ చూడలేదని చెప్పారు. దానిపై మీడియా ప్రతినిధులు మరీ మరీ ప్రస్తావించగా ఆయన చిరాకు పడ్డారు. ఇటువంటి ప్రశ్నలు వేయవద్దని ఆయన సూచించారు. పార్టీ అధిష్టానం చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పుడు రాజీనామాలు చేయడమేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వారినే అడగండని జవాబిచ్చారు. తీర్మానం చేశాం, చేస్తే ఏమిటి, ఇటువంటి ఆదేశాలను తాను స్వీకరించడానికి సిద్ధంగా లేనని, రాజీనామాలను స్పీకర్ అదేశించలేదని, పార్టీ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తుండగానే ఆయన లేచి వెళ్లిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+