వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ చిచ్చు: 5 గురు మంత్రులు రాజీనామా?

By Santaram
|
Google Oneindia TeluguNews

AP Secretariat
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లై ప్రకటించడం ఆంధ్ర, రాయలసీమ మంత్రులను మనస్తాపానికి గురి చేసినట్టు తెలుస్తోంది. పిళ్లై ప్రకటనకు నిరసన తెలుపుతూ అయిదుగురు మంత్రులు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఒకటి రెండు రోజుల్లో వీరు మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు మంత్రులు పితాని, పార్ధసారధి బాహాటంగా పిళ్ళై వ్యాఖ్యలను ఖండించారు. పైళ్ళై వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్నాయని వారు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లై ప్రకటించారు. తెలంగాణ రాజధాని హైదరాబాదే ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారని, ఆందోళనలు తగ్గుతాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారని, అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, వెంటనే రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X