వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సరికారు: జానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఆంధ్ర,రాయలసీమ నేతల తీరును మాజీ హోం మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డి తప్పు పట్టారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు అవమానాలకు గురవుతూ కూడా తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం విజ్ఞతకే వదిలేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎంతగా రెచ్చగొట్టినా తెలంగాణ కాంగ్రెసు నాయకులు రెచ్చిపోలేదని, అప్రమత్తంగా వ్యవహరించారని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. ఇలా వ్యవరిస్తే కాంగ్రెసు నేతల మధ్య కూడా సామరస్యం దెబ్బ తింటుందని ఆయన హితవు పలికారు.

సంయమనంతో, సహనంతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు దీక్షతో పని చేశారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రశాంతంగా జరిగిందని, ఒకటి రెండు అవాంఛనీయ సంఘటనలు జరిగినా కాంగ్రెసు పెద్దలు జోక్యం చేసుకుని సంయమనంతో వ్యవహరించేలా చూశారని ఆయన చెప్పారు. కాంగ్రెసు పెద్దలు ప్రాంతాల మధ్య సామరస్యం దెబ్బ తినకుండా వ్యవహరించారని, ఇదే పద్ధతిని సీమాంధ్ర నేతలు పాటిస్తే మంచిదని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వాన్ని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అంగీకరించడం మంచిదని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల తమకేదైనా నష్టం జరుగుతుందని భావిస్తే సీమాంధ్ర నేతలు ఆ విషయాలను అధిష్టానానికి చెప్పుకోవాలని, ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X