సీమాంధ్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళన

Rayalseema -Coastal Andhra
హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదానికి అనుకూలంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సోమవారం కూడా ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అరెస్టుతో పరిస్థితి కాస్తా ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లోకి కాంగ్రెసు కార్యకర్తలు చొరబడ్డారు. పాలకొల్లులో రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ బెంజి సర్కిల్ కు ఆందోళనకారులకు చేరుకున్నారు. రాయలసీమలోనూ, కోస్తాంధ్రలోనూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు బంద్ నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తిరుపతిలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. రాజమండ్రిలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జైరాముడు అనే తాపీ మేస్త్రీ సమైక్య నినాదానికి అనుకూలంగా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడలో తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+