Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖపట్నం జిల్లాలో ఉద్యమం తీవ్రం: ఎంపీ సబ్బం

Sabbam Hari
విశాఖపట్నం: విజయవాడ లోక్‌సభ సభ్యులు రాజగోపాల్‌ అరెస్టుపై కాంగ్రెస్‌ ప్రతినిధులు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరాహారదీక్ష చేయాలని భావించిన ఆయన్ని అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్యం ఎక్కడుందనే ప్రశ్న తలెత్తుతోందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి విశాఖలో వ్యాఖ్యానించారు. సబ్బం హరి మొదటి నుంచి రాజగోపాల్ తో పాటు సమైక్యరాగాన్ని ఆలపిస్తున్నారు. లగడపాటి అరెస్టుకు విశాఖపట్నం జిల్లాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.

సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి వినిపించడం మినహా ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదన్నారు. సీఎంను కలిసేందుకు హైదరాబాద్‌కు వస్తేనే ఇంతటి ఉద్రిక్తతలకు రాజేసిన వ్యక్తుల తీరును చూస్తుంటే మున్ముందు ఇంకెలా వ్యవహరిస్తారో నన్న ఆందోళన కనిపిస్తోందని అన్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. చోడవరంలో అలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. లగడపాటి అరెస్ట్‌కు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామస్తుల రాస్తారో చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అలపక్ష నేతలు రాస్తారోకోకు దిగారు. ఎస్‌కేయూ విద్యార్థుల అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. తిరుపతిలోనూ విద్యార్థులు నిరసనలకు దిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+