తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం కావాలి: ప్రణబ్ ముఖర్జీ

చిదంబరం ప్రకటన రాగానే తమ తమ ప్రాంతాల్లో దాన్ని అర్థం చేసుకుని, అపార్థం చేసుకుని ప్రజలు అందోళనలకు దిగారని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. బాధతో, దుగ్ధతో ప్రజలు వీధికెక్కారని ఆయన అన్నారు. ప్రణబ్ ముఖర్జీ తమకు హామీ ఇచ్చినందున ఆందోళనలు విరమించాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ తీర్మానం రాకపోతే తెలంగాణ రాదని ప్రణబ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం చీలిపోతుందనే నమ్మకం తమకు లేదని పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ అన్నారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయం పార్లమెంటుకు రావాలని కనుమూరి బాపిరాజు అన్నారు. దేశరక్షణ దృష్యా చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరి కాదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సమైక్యమంటే తెలంగాణ గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. రాజీనామాలు చేయడం పార్టీ ధిక్కారమేమీ కాదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications