సమైక్యవాదులది ఏకపక్ష ప్రేమ: ఈటెల

తెలంగాణ తీర్మానం పెడితే శాసనసభలో సమర్థిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వెలువడగానే తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణను మరోసారి వంచించడానికి పార్టీలకు అతీతంగా జెండాలను, సిద్ధాంతాలను పక్కనపెట్టి 24 గంటలలోపే ఏకమయ్యారని ఆయన అన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడానికి అన్నీ వదులుకున్నారని ఆయన అన్నారు. తమది ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు, నీళ్ల సమస్య అని ఆయన అన్నారు. తమపై కుట్రపూరితంగా కోస్తా, రాయలసీమ శాసనసభ్యులు ఏకమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications