టిడీపిలో ఆంధ్రది ఓదారి, తెలంగాణది మరో దారి!
ఆంధ్ర, రాయలసీమకు చెందిన ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడీపి వారి మనోభిప్రాయాలు మరో విధంగా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటి, కోస్తా కమిటి అని రెండు వేరువేరుగా ఏర్పాటు చేయవలసిందేనని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటివద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడుగా ఉండవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఇంతకు ముందు చేసి ప్రకటనకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆయన వైఖరిలో మార్పు రాకపోతే అప్పుడు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.