వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడీపిలో ఆంధ్రది ఓదారి, తెలంగాణది మరో దారి!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు టీడీపీ తరపున ఆంధ్ర, రాయలసీమనుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమయ్యారు. అన్ని రాజకీయపార్టీలు, సామాజికసంఘాలు కులసంఘాలను కలుపుకుని రాష్ట్రం విడిపోకుండా ఉద్యమం చేయాలని నిర్ణయించారు.

ఆంధ్ర, రాయలసీమకు చెందిన ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడీపి వారి మనోభిప్రాయాలు మరో విధంగా ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటి, కోస్తా కమిటి అని రెండు వేరువేరుగా ఏర్పాటు చేయవలసిందేనని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటివద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడుగా ఉండవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఇంతకు ముందు చేసి ప్రకటనకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆయన వైఖరిలో మార్పు రాకపోతే అప్పుడు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X