లగడపాటి దీక్షపై విజయవాడలో తీవ్ర ఉత్కంఠ

రాజగోపాల్ 2004 నుంచి సమైక్యాంధ్ర వాదం విన్పిస్తున్నారు. తెలంగాణ వాదులంతా రాజగోపాల్పైకి ఒంటికాలితో లేచేవారు. ఆయన కూడా అంతే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా సై అంటే సై అనేవారు. ఈ అయిదేళ్ళలో అనేకమార్లు టీఆర్ఎస్ శ్రేణులు, రాజగోపాల్ మధ్య హైదరాబాద్ లో యుద్ధమే జరిగింది.
హైదరాబాద్ ప్రెస్క్లబ్లో గొడవ జరిగింది. నిజమాబాద్లో శ్రీనివాస్ కుమారుడు పెళ్ళికి వెళ్ళిన రాజగోపాల్ కు అక్కడ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ తో ఈ అయిదేళ్ళు రాజగోపాల్ ఒంటరి పోరాటం జరిపారు. హైదరాబాద్ లో రాజగోపాల్ ను అరెస్టు చేస్తారా? అరెస్టు చేస్తే ఎక్కడికి తరలిస్తారు అని స్ధానిక నాయకులు చర్చించుకుంటున్నారు. విజయవాడలో సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్నవారు సోమవారం ఉదయం టీవీలకు అతుక్కుపోయారు.












Click it and Unblock the Notifications