వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayalseema -Coastal Andhra
విజయవాడ: సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణేతర ప్రాంతాల్లో ఉద్యమం కొనసాగుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఎస్కే యూనివర్శిటీల్లో విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్థులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. అనంతపురంలో కూడా పరిటాల సునీత తదితరుల దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పడి ఉద్యమం కొనసాగిస్తున్నారు.

రాజమండ్రి జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధం చేశారు. చీరాలలో కాంగ్రెసు నాయకులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కర్నూలులో గత ఐదు రోజులుగా బస్సులు కదలడం లేదు. రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలోని చిలుకూరిపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల రైళ్లను కూడా ఆపేశారు. శబరి ఎక్స్ ప్రెస్ ను ఆందోళనకారులు ఆపేశారు. కాకినాడలో కాంగ్రెసు శానసభ్యుడు చంద్రశేఖర రెడ్డి దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X