వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరులో శబరి ఎక్స్ ప్రెస్ ను నిలిపేసిన సమైక్యవాదులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabari Express
గుంటూరు: సమైక్యాంధ్రను కోరుతున్న ఆందోళనకారులు గుంటూరు నగరంలో శబరి ఎక్స్ ప్రెస్ ను కొంతసేపు నిలిపివేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్‌డౌన్‌ చేయించారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, సత్తెనపల్లి, రేపల్లె, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేటలో పార్టీలకతీతంగా నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు.

ప్రత్యేక తెలంగాణాకు ప్రతి కూలంగా సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సోమవారం తెనాలి పట్టణంలో సంపూర్ణ బంద్‌ నిర్వహించారు. దీంతో విద్యార్థుల భారీ ర్యాలీతో పట్టణం నిరసనలతో మార్మోగింది. విద్యార్థులు ప్ల కార్డులు,బ్యానర్లు చేబూని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కెసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇంకా చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట, పత్తిపాడు, రేపల్లె, వినుకొండ, మంగళగిరి పట్టణాల్లో కూడా ఆందోళన కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X