విద్యార్థులపై లాఠీచార్జీ: ఎస్కేయూలో ఉద్రిక్తత

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. ఈ ఘర్షణలో మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి సింగనమల పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసు స్టేషన్ ఎదుట యూనివర్శిటీ అధికారులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర నినాదంతో గత నాలుగు రోజులుగా ఎస్కేయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతపురంలో ఆమరణ దీక్ష ప్రారంభించిన తెలుగుదేశం శాసనసభ్యులను పరామర్శించేందుకు విద్యార్థి నాయకులు సోమవారం విశ్వవిద్యాలయం నుంచి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మంగళవారం ఎట్టి పరిస్థితిలోనూ అక్కడికి వెళ్లాలని విద్యార్థి నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే మృతి చెందిన రాముడు అనే వ్యక్తి మృతదేహంతో ర్యాలీ చేయడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సింగనమల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందిని బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications