వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులపై లాఠీచార్జీ: ఎస్కేయూలో ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

SK University
అనంతపురం: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులకు,పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. విశ్వవిద్యాలయ విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్ద యెత్తున మోహరించారు. ఈ స్థితిలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులపైకి పోలీసులు రాళ్లు రువ్వారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. ఈ ఘర్షణలో మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి సింగనమల పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసు స్టేషన్ ఎదుట యూనివర్శిటీ అధికారులు ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర నినాదంతో గత నాలుగు రోజులుగా ఎస్కేయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతపురంలో ఆమరణ దీక్ష ప్రారంభించిన తెలుగుదేశం శాసనసభ్యులను పరామర్శించేందుకు విద్యార్థి నాయకులు సోమవారం విశ్వవిద్యాలయం నుంచి బయలుదేరారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

మంగళవారం ఎట్టి పరిస్థితిలోనూ అక్కడికి వెళ్లాలని విద్యార్థి నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే మృతి చెందిన రాముడు అనే వ్యక్తి మృతదేహంతో ర్యాలీ చేయడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సింగనమల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బందిని బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X