వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావు స్వగ్రామంలో సమైక్య ఉద్యమం తీవ్రం

By Santaram
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
గుడివాడ: సమైక్యాంధ్ర నినాదంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో గుడివాడ సమీపంలోని పెదపారుపూడి గ్రామంలో రెండో రోజూ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పెద పారుపూడి "ఈనాడు" రామోజీరావు స్వగ్రామం. ఇంత చిన్న గ్రామంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం సంపూర్ణంగా సాగడం విశేషం. సోమవారం దీక్షలో ఎంపీపీ తుమ్మపూడి దేవమణి, మండల తెలుగు యువత అధ్యక్షుడు వీరపనేని కిరణ్‌, ఆజ విజయలక్ష్మి, నగుళ్ళ నాగయ్య, సర్పంచ్‌ ఆర్‌ అప్పారావు పాల్గొన్నారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ పొట్లూరి హనుమంతరావు, ఎంపీపీ విఆర్‌ ప్రసాద్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు కొడాలి జగన్మోహనరావు, రాజబోయిన కోటయ్య, ఎంపీటీసీల సంఘం కార్యదర్శి నామా వెంకటేశ్వరరావు, దేశం నాయకులు సూరపనేని సురేంద్రబాబు, సర్పంచ్‌ మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో పెదపారు పూడి ఆర్‌ అండ్‌ బి రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఎంపీ రాజగోపాల్‌ అరెస్టుకు నిరస నగా రాస్తారోకో చేసి కేసీఆర్‌ దిష్టిబొ మ్మను దహనం చేశారు. జడ్పీటీసీ పొట్లూరి హనుమంతరావు, ఎంపీపీ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

యలమర్రు నాలుగు రోడ్ల కూడలిలో 500 మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తొలుత సోనియాగాంధీ, చిదంబరం, కేసీఆర్‌ దిష్టిబొమ్మలను గ్రామంలో ఊరేగించి దహనం చేశారు. కార్యక్రమంలో బొప్పన రమేష్‌చౌదరి, కుమార్‌స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X