వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వాళ్లే టిడిపితో చేతులు కలిపారు: జగన్ పై విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో తమ వాళ్లే తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం బాధ కలిగిస్తోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీని సమర్థంచడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన తీవ్ర ఉద్వేగంతో విరుచుకుపడ్డారు. ఎవరో వ్యక్తి మీద తాను అధిష్టానంపై ఫిర్యాదు చేయదలుచుకోలేదని, తనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉండనివ్వరని కొంత మంది నాయకులు ప్రచారం చేస్తున్నారని, అది తప్పుడు ప్రచారమని ఆయన అన్నారు. ఎవరైనా తెలంగాణలో ఉండవచ్చునని ఆయన అన్నారు.

యాభై ఏళ్ల ఆకాంక్ష తీరే సమయం వచ్చేసరికి కొంత మంది విద్యార్థులను పట్టుకుని హంగామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసులో వాదనలు, చర్యలు జరుగుతున్న కాలంలో మాట్లాడని నాయకులు ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారని ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను ఉద్దేశించి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని సిఎల్పీ తమకు తెలంగాణ కావాలంటూ సోనియాకు వినతి పత్రం ఇచ్చారని, పలు సందర్భాల్లో తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా చర్యలు తీసుకుందని, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని, ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసాశారని, ఈ సందర్భాల్లో ఎప్పుడు కూడా ఈ సమైక్యవాదులు ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసరికి హంగామా చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X