మాకు సానుకూల ప్రకటన వస్తుంది: జెసి దివాకర్ రెడ్డి

ఢిల్లీ లాబీయింగ్ తమకు సంతృప్తినిచ్చిందని, పార్టీ అధిష్టానం ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం పూర్తిగా జరిగిపోయింది, పంపకాల వ్యవహారం మాత్రమే మిగిలి ఉందనే అభిప్రాయం చిదంబరం ప్రకటన వల్ల అర్థం చేసుకున్నారని, దాంతో ఆందోళన పెల్లుబుకిందని, తాము ఇక్కడికి వచ్చిన తర్వాత అది కాదని తెలిసిందని ఆయన అన్నారు. అందరి మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే రాష్ట్ర విభజన ముందుకు సాగుతుందనేది తమకు అర్థమైందని, రాష్ట్ర విభజనకు తప్పకుండా శాసనసభ తీర్మానం కూడా అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications