వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాలకు ప్రాంతీయతత్వం వద్దు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
అనంతపురం: కళాకారులకు ప్రాంతీయ తత్వాన్ని ముడిపెట్టవద్దని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సమైక్యవాదుల సినిమాలు తెలంగాణవారు ఎందుకు చూడాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనడాన్ని ఆయన ఖండించారు. తన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల కారణంగా కేంద్రం సమైక్యవాదానికి తలొగ్గక తప్పదని ఆయన అన్నారు. బలవంతంగా ఉద్యమాన్ని అణచలేరని ఆయన అన్నారు. ఎస్కేయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తెలుగుదేశం శాసనసభ్యులను ఆయన పరామర్శించారు. తాడిపత్రి ప్రజారాజ్యం నేత పైలా నరసింహయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు చిరంజీవి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీత, బికె పార్థసారథి, ఆ పార్టీ నాయకులు వరదాపురం సూరి, మహాలక్ష్మి, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడ చవ్వా రాజశేఖర రెడ్డిలను ఆయన పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X