లగడపాటి రాజగోపాల్ దీక్షలోనే ఉన్నారు: జెసి

లగడపాటి రాజగోపాల్ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రికి తెలిసి ఉంటుందని ఆయన చెప్పారు. లగడపాటి ఆరోగ్యం సంతృప్తికరంగానే ఉందని ఆయన చెప్పారు. లగడపాటి రాజగోపాల్ అలసిపోయి పడుకున్నారని, తాను లగడపాటితో మాట్లాడలేకపోయానని ఆయన చెప్పారు. తాను వైద్యులతో మాట్లాడినట్లు, లగడపాటిని కదిలించవద్దని వారు చెప్పినట్లు ఆయన అన్నారు. కాగా, రాజగోపాల్ నిమ్స్ లో చేరడంతో తెలంగాణ అనుకూలవర్గాలు ధర్నాకు దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications