సమైక్యాంధ్ర కోసం రాజోలులో అర్చకుల పాదయాత్ర

సమైక్యాంధ్రకు మద్దతుగా నాలుగురోడ్ల కూడలిలో దున్నపోతుపై కేసీఆర్ పేరు రాసి దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఎనిమిదో రోజు దీక్షల్లో జక్కంపూడి వాసు, పినిశెట్టి శేఖర్ పాల్గొన్నారు. పాశర్లపూడిలంకలో రిలే దీక్షలు చేపట్టారు. ఎంపీటీసీ కోలా సత్యనారాయణ, సర్పంచ్ బొంతు అమరావతి, తెలగారెడ్డి రాధాకృష్ణ, పెదమల్లు రామకృష్ణ పాల్గొన్నారు. పాశర్లపూడి దీక్షల్లో 13ఏళ్ల అంధుడు బొరుసు హరికృష్ణమణికంఠతో పాటు 27 మంది పాల్గొన్నారు. పలు గ్రామాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గెడ్డం రామారావు, మద్దాల కృష్ణమూర్తి, జక్కంపూడి తాతాజీ, భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, దాకే సతీష్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications